లండన్: కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్తో చెలరేగిపోవడంతో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో భారత్ 5-1తో ఒలింపిక్ చాంపియన్ బెల్జియంను మట్టికరిపించింది. భారత జట్టు తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (20వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా..
వివేక్ సాగర్ ప్రసాద్ (2వ ని.లో), అమిత్ రొహిదాస్ (29వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (60వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. బెల్జియం తరఫున విలియం గిైస్లెన్ (46వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే చక్కటి ఫీల్డ్గోల్తో ఖాతా తెరిచిన భారత్.. మ్యాచ్ ముగిసే వరకు అదే జోరు కొనసాగించింది.