హైదరాబాద్ : సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
నిబంధనల మేరకు మ్యాచ్లను మూడు గంటల 20 నిమిషాల్లోనే ముగిసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలా మ్యాచ్లు నాలుగు గంటల పాటు సాగుతున్నాయి. ఐపీఎల్ నిర్వాహకులకు స్లో ఓవర్రేట్ తలనొప్పిగా మారింది.