Azharuddin on Ravisastri | టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపై టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తీరుపై మాజీ సారధి మహ్మద్ అజారుద్దీన్ మండిపడ్డారు. మ్యాచ్ తర్వాత జరిగిన మీడియా సమావేశానికి రవిశాస్త్రి హాజరు కావాల్సిందని వ్యాఖ్యానించారు. మ్యాచ్లు గెలుపొందిన తర్వాత జరిగే మీడియా సమావేశాలకు మాత్రమే హాజరు కావడం సరి కాదని రవిశాస్త్రిపై సెటైర్లు వేశారు.
ఒకవేళ విరాట్ కోహ్లీ హాజరు కాకపోయినా పర్వాలేదన్నారు. రవిశాస్త్రి తనకు బదులు పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పంపడం సరి కాదన్నారు. జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత హెడ్కోచ్ రవిశాస్త్రిదేనని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. టీ-20 వరల్డ్ కప్ 2 గ్రూప్ మ్యాచ్ల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైన నేపథ్యంలో అజారుద్దీన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.