హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కాలికట్ హీరోస్ ఉత్కంఠ విజయంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో కాలికట్ 3-2 (15-12, 15-9, 9-15, 9-15, 15-11)తో కొచ్చి బ్లూ స్పైకర్స్పై విజయం సాధించింది. తొలి రెండు సెట్లలో కొచ్చిపై దూకుడు ప్రదర్శించిన కాలికట్ తదుపరి రెండు సెట్లలో వెనుకబడింది. నిర్ణయాత్మక మూడో సెట్లో విజృంభించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆఖరి వరకు ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్లో కాలికట్ విజయం సాధించి సెమీస్ రేసులో నిలిచింది. కాలికట్ కెప్టెన్ వినీత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. శనివారం జరుగనున్న మ్యాచ్లో కోల్కత్తా థండర్ బౌల్ట్స్తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడనుంది.