కోపెన్హగన్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లడం ద్వారా పతకం ఖాయం చేసుకున్నాడు. దేశం తరఫున బరిలోకి దిగిన ఇతర ప్లేయర్లంతా నిరాశ పరిచిన చోట.. ప్రణయ్ అద్వితీయ ఆటతీరు కనబర్చాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13-21, 21-15, 21-16తో టాప్ సీడ్ విక్టర్ అక్సల్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు.
తొలి గేమ్లో ఓడిన ప్రణయ్.. మిగిలిన రెండు గేమ్ల్లో విజృంభించాడు. డిఫెండింగ్ చాంపియన్ అక్సల్సెన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్లో 18-21, 19-21తో కిమ్ అస్ట్రుప్-ఆండ్రెస్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది.