సెంచూరియన్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. రెండవ ఇన్నింగ్స్లో ఇవాళ ఉదయం డీన్ ఎల్గర్ వికెట్ను సౌతాఫ్రికా కోల్పోయింది. దీంతో భారత్ విక్టరీకి మరింత చేరువైంది. బుమ్రా బౌలింగ్లో ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్న ఎల్గర్ను వికెట్ల ముందు బుమ్రా పట్టేశాడు. ఎల్గర్ 77 రన్స్ చేసి నిష్క్రమించాడు. బవుమా, డీకాక్లు క్రీజ్లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 150 రన్స్ చేసింది. 305 రన్స్ టార్గెట్తో సఫారీ జట్టు రెండవ ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.