IND vs SL : ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత జట్టు సూపర్ 4 చివరి పోరులో శ్రీలంకతో తలపడుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న నామమాత్రమైన ఈ మ్యాచ్లోనూ విజయంతో టైటిల్ పోరుకు సిద్దమవ్వాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు.. వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక.. ఓదార్పు విక్టరీతో స్వదేశం వెళ్లాలని అనుకుంటోంది. ఒకరకంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకమే. టాస్ గెలిచిన చరిత్ అసలంక బౌలింగ్ తీసుకున్నాడు.
పాక్తో మ్యాచ్లో విఫలమైన పేసర్ చమిక కరుణరత్నే బదులు లియాంగేను తుదిజట్టులోకి తీసకున్నట్టు చెప్పాడు అసలంక. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ను 170-175లోపు కట్టడి చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. నామమాత్రమైన మ్యాచ్ కావడంతో ప్రధాన పేసర్ బుమ్రా, ఆల్రౌండర్ శివం దూబేలను పక్కనపెట్టి.. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానాలను తీసుకున్నట్టు సూర్య తెలిపాడు.
Toss: Sri Lanka have won and will bowl
LIVE: https://t.co/5DH5eC3njO pic.twitter.com/e1tSighfJ3
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
గత మ్యాచ్లో పాక్, బంగ్లాపై పలు క్యాచ్లు నేలపాలు చేసిన భారత ఆటగాళ్లు ఈసారి ఫీల్డింగ్ పొరపాట్లపై దృష్టి సారించనున్నారు. పొట్టి ఫార్మాట్లో లంకపై భారత్దే ఆధిక్యం. ఇప్పటివరకూ టీ20ల్లో ఇరుజట్లు 31 సార్లు ఎదురుపడగా టీమిండియా 22 విజయాలతో ఆధిపత్యం చెలాయించింది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనగే, కమిందు మెండిస్, దసున్ శనక, వనిందు హసరంగ, చమీర, థీక్షణ, తుషార.