Varsha Reddy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాంచీ(జార్ఖండ్) వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సైక్లిస్ట్ వర్షారెడ్డి కాంస్య పతకంతో మెరిసింది.
సోమవారం జరిగిన బాలికల అండర్-17 20కి.మీ రోడ్ రేసులో బరిలోకి దిగిన వర్షారెడ్డి 38.00.45 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ అసవరీ (మహారాష్ట్ర), తబిత (తమిళనాడు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.