న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల ప్రకారమే రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అరెస్టు ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) తెలిపారు. డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జర్నలిస్టులతో ఆయన మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు చేసిన డిమాండ్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ అరెస్టు మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుందని ఆయన అన్నారు. లైంగికంగా వేధింపులకు పాల్పడిన బ్రిజ్ను అరెస్టు చేయాలని రెజ్లర్ సాక్షీ మాలిక్తో పాటు ఇతర రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్పై ఛార్జ్షీట్ దాఖలు అవుతుందని, ఒకవేళ ఆయన్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.