హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ క్రికెటర్ గొంగిడి త్రిషను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రత్యేకంగా సన్మానించింది. శనివారం సన్రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఆరంభానికి ముందు విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా త్రిషకు జ్ఞాపిక అందజేశాడు.
భారత అండర్-19 మహిళల జట్టు ప్రపంచకప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ భద్రాచలం అమ్మాయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని హెచ్సీఏ ఏకసభ్య కమిటీ చైర్మన్, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆకాంక్షించారు.