India vs West Indies 3rd T20 | టీం ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. టీం ఇండియాబౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, క్లేమేయర్స్ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. హార్దిక్ పాండ్యా 7.2 ఓవర్లో బ్రాండన్ కింగ్.. క్లీన్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటి వరకు వెస్టిండీస్ 57 పరుగులు చేసింది. దీంతో కెప్టెన్ నికోలస్ పూరన్ క్రీజ్లోకి వచ్చి రెండు పరుగులు చేశాడు. మరో ఓపెనర్ క్లే మేయర్స్ 38 పరుగులు చేశాడు.
అప్పటి వరకు టాస్ గెలిచి బౌలింగ్ దిగిన టీం ఇండియా బౌలర్లను వెస్టిండీస్ ఓపెనర్లు గట్టిగానే ఎదుర్కొంటున్నారు. తొలి ఓవర్లో సింగిల్తో సరిపెట్టిన వెస్టిండీస్ బ్యాట్స్మన్లు.. రెండో ఓవర్ నుంచే విజృంభిస్తున్నారు. భువనేశ్వర్ బౌలింగ్ను చెండాడుతున్నారు. రెండో ఓవర్లో ఒక ఫోర్తో బ్రాండన్ కింగ్ పరుగుల వేట ప్రారంభించాడు.. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేశారు.