అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల 57కిలోల విభాగం సెమీస్లో హుసామ్ 5-0 తేడాతో లాల్మావ(మిజోరాం)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన హుసామ్.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వలేదు. పదునైన పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో చెలరేగి బౌట్ను ఏకపక్షం చేశాడు. బుధవారం జరిగే ఫైనల్లో హర్యానా బాక్సర్ సచిన్తో హుసామ్ తలపడుతాడు.