క్రైస్ట్చర్చ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్తో జరుగుతున్న పోరులో శ్రీలంక విజృంభిస్తున్నది. మొదట బ్యాటింగ్ చేసిన లంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (87) టాప్ స్కోరర్ కాగా.. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 5, మ్యాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (67), కాన్వే (30), డారిల్ మిషెల్ (40 బ్యాటింగ్) రాణించారు. లంక బౌలర్లలో అసిత, లహిరు చెరో రెండు వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. ప్రత్యర్థి స్కోరుకు 193 పరుగుల దూరంలో ఉంది.