FIFA World Cup | ఖతార్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరింది. ఇంక రెండంటే రెండే మ్యాచ్ల ద్వారా ఫుట్బాల్ ప్రపంచ విజేత ఎవరో తేలిపోనుంది. కాగా, మంగళవారం అర్ధరాత్రి లుసైల్ స్టేడియంలో జరిగిన సెమీస్ పోరులో పలువురు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు మెరిసారు.
సంజయ్ కపూర్, చుంకీ పాండే, అనన్య పాండే, కరిష్మా కపూర్ తదితర సెలబ్రిటీలు మంగళవారం అర్ధరాత్రి అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ స్టేడియంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఫిఫా ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్లోకి అర్జెంటీనా ప్రవేశించింది. క్రొయేషియాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.