బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో (CWG) భారత్కు మరో పతకం లభించింది. వెయిట్లిఫ్టింగ్లో బింద్యారాణి దేవి (Bindyarani Devi) రజతం సొంతం చేసుకున్నది. మహిళల 55 కిలోల విభాగంలో బింద్వారాణి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ సాధించింది. అయితే క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు బ్రోన్జ్ మెడల్ వస్తుందని అనుకున్నారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి .. 116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది.
కాగా, బింద్యారాణి పతకం సాధించడంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మెడల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు కూడా వెయిట్లిఫ్టింగ్లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాస్య పతకం లభించింది.