ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో సహా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ టూర్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను టెస్టు జట్టు నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
భువనేశ్వర్ కుమార్ ఇకపై టెస్టు క్రికెట్ ఆడటానికి ఇష్టంగాలేడంటూ విశ్వసనీయ వర్గాలను ఉదహరిస్తూ కథనాలు వచ్చాయి. టెస్టుల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న పుకార్లను సోషల్మీడియాలో భువీ ఖండించాడు. విశ్వసనీయ వర్గాల పేరుతో ఊహించుకొని కథనాలు రాస్తున్న మీడియాను అతడు విమర్శించాడు.
‘నేను టెస్టు క్రికెట్ ఆడటానికి సుముఖంగా లేనంటూ కథనాలు వచ్చాయి. నేనొకటి స్పష్టం చేయాలనుకుంటున్నాను. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇదే పద్ధతిని ఇకపైనా కొనసాగిస్తాను. మీకు ఒక సూచన ఏంటంటే.. దయచేసి విశ్వసనీయ వర్గాల ఆధారంగా కథనాలు రాయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ’
భువీ ట్వీట్ చేశాడు.
There have been articles about me not wanting to play Test cricket. Just to clarify, I have always prepared myself for all three formats irrespective of the team selection and will continue to do the same.
— Bhuvneshwar Kumar (@BhuviOfficial) May 15, 2021
Suggestion – please don’t write your assumptions based on “sources”!