హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో లక్సెట్టిపేటకు చెందిన భువనేశ్వరి కాంస్య పతకం గెలుచుకుంది. రోహ్తక్లో జరిగిన టోర్నీలో ఇస్నాపూర్ రెజ్లింగ్ అకాడమీకి చెందిన భువనేశ్వరి చక్కటి ప్రదర్శన కనబర్చి మూడో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న భువనేశ్వరి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.