లాసాన్నె: ఎఫ్ఐహెచ్ హాకీ ఫైవ్స్ టోర్నీలో భా రత్ శుభారంభం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన భా రత పురుషుల జట్టు .. పాకిస్థాన్తో జరిగిన రెండో పోరును ‘డ్రా’ చేసుకుంది. మహిళల జట్టుకు మాత్రం పరాభవం ఎదురైంది.
ఉరుగ్వే, పోలాండ్తో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ మన అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. పురుషుల జట్టు మొదటి మ్యాచ్ లో 4-3తో ఆతిథ్య న్యూజిలాండ్ను చిత్తు చేసింది. రెండో మ్యాచ్లో 2-2తో పాకిస్థాన్తో ‘డ్రా’ చేసుకుంది. అమ్మాయిలు 3-4తో ఉరుగ్వే చేతిలో, 1-3తో పోలాండ్ చేతిలో ఓడి నిరాశ పర్చారు. నైపుణ్యం, ఫిట్నెస్కు సవాల్గా నిలిచే ఈ టోర్నీలో మన అబ్బాయిలు రాణించారు.