హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్టీల్ మ్యాన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో భద్రాద్రి బాడీ బిల్డర్ బండారు లోక్నాథ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. గతంలో మిస్టర్ తెలంగాణగా ఎంపికైన ఈ యువ బాడీబిల్డర్.. మిస్టర్ ఇండియా పోటీలకు సైతం అర్హత సాధించాడు.
భద్రాచలం పట్టణంలోని వైయస్ఆర్ కాలనీకి చెందిన లోక్నాథ్ చిన్నప్పటి నుంచి బాడీబిల్డింగ్పై ఇష్టం పెంచుకున్నాడు. డిగ్రీ అనంతరం సీరియస్గా వర్కౌట్లు ప్రారంభించిన లోక్నాథ్.. అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకు న్నాడు. హైదరాబాద్ వేదికగా శనివారం ముగిసిన స్టీల్ మ్యాన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో సత్తాచాటిన 24 ఏండ్ల లోక్నాథ్ను స్థానికులు భద్రాద్రి బాహుబలిగా అభివర్ణిస్తున్నారు.