బెంగళూరు: జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఆర్ సంభవ్, ధినిధి సరికొత్త జాతీయ రికార్డులతో స్వర్ణాలు సాధించారు. మంగళవారం జరిగిన బాలుర 200 మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును సంభవ్ (కర్ణాటక) 1:53.41 సెకండ్లలో ఈది రికార్డు నెలకొల్పాడు. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన శ్రీహరి నటరాజ్ రికార్డు(1:53:54సె)ను సంభవ్ తాజాగా అధిగమించాడు. బాలుర విభాగంలో అనీశ్ ఎస్ గౌడ 1:53.54 సెకండ్లలో ఈది రెండో స్థానంలో నిలువగా, ప్రముఖ సినీ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ (1:55.93సె) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. గ్రూప్ 1 బాలుర విభాగంలో స్వదేశ్ మండల్, షోయన్ గంగూలీ వేగంగా ఈదారు. చివరకు మండల్ (2:08.08సె) ముందంజలో నిలిచి స్వర్ణం సాధించగా షోయన్ (2:09.05 సె)తో రజతం పొందాడు. వీరిద్దరూ నీల్ రాయ్ పేరిట (2:10.26 సె) ఉన్న రికార్డును అధిగమించారు. కల్ప్ ఎస్ బోహ్ర (2:12.61 సె) రజతం గెలిచాడు. 200 మీటర్ల ఫ్రీైస్టెల్లో గ్రూప్ 3 అమ్మాయిల్లో ధినిధి (కర్ణాటక 2:14.94 సెకండ్లతో స్వర్ణం సాధించింది.