అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్లో గురువారం బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన పోరు వీక్షకులకు మజా అందించింది. హోరాహోరీ పోరులో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరాటంలో ఇరు జట్లు సమంగా 28 పాయింట్లు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. బెంగాల్ జట్టులో శ్రీకాంత్ 7, నితిన్ 5, మనిందర్ 4 పాయింట్లు సాధించారు. కాగా జైపూర్ జట్టులో సబ్స్టిట్యూట్ ఆటగాడు భవానీ రాజ్పుత్ 10 పాయింట్లతో రాణించగా, అర్జున్ 6, అంకుష్ 4 పాయింట్లతో సహకరించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 33-30 స్కోరుతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది.