భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం టీమిండియా టైటిల్ స్పాన్సర్గా తప్పుకున్నది. PAYTM స్థానంలో గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ MASTER CARD ఇకనుంచి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. పేటీఎం అభ్యర్థన మేరకు బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్కు మళ్లించింది.
పేటీఎం 2015 నుంచి భారత్లో దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్గా వ్యహరిస్తున్నది. 2019లో ఈ ఒప్పందం మరో నాలుగేండ్ల పాటు పునరుద్దరించుకుంది. ఈ డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు. ఒప్పందం ప్రకారం పేటీఎం 2023 వరకు కొనసాగాలి. కానీ ఆ సంస్థ మాత్రం ఒక ఏడాది ఉండగానే తన హక్కులను మాస్టర్ కార్డ్కు బదిలీచేయాలని బీసీసీఐని కోరింది. ముంబైలో ఇటీవలే ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీంతో బీసీసీఐ.. పేటీఎంను తొలగించి మాస్టర్ కార్డ్కు ఆ హక్కులు అప్పజెప్పింది.
సెప్టెంబర్లో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల సిరీస్ మాస్టర్ కార్డ్కు తొలి టైటిల్ స్పాన్సర్షిప్ సిరీస్ కానున్నది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో కూడా టీమిండియా 3 టీ20లు ఆడుతుంది. 2023 వరకు భారత్లో జరిగే దేశవాళీ మ్యాచ్లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు మాస్టర్ కార్డ్ స్పాన్సర్గా ఉండనుంది. అయితే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు మాత్రం టాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.