BCCI : టీమిండియా జెర్సీ స్ఫాన్సర్ అయిన బైజూస్తో ఒప్పందంపై బీసీసీఐ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. అందుకోసం బీసీసీఐ సభ్యులు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఎడ్యుటెక్ కంపెనీ కాంట్రాక్టును వదులుకోవాలనే ఆలోచనతో ఉంది. అయితే.. 2022 డిసెంబర్లో ఇరు వర్గాల మధ్య వర్చువల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో 2023 మార్చి వరకు ఒప్పందాన్ని కొనసాగించాలని బైజూస్ను బీసీసీఐ కోరింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అనే ఆసక్తి మొదలైంది. పోయిన ఏడాది జూన్లో బైజూస్ 2023 నవంబర్ వరకు స్పాన్సర్షిప్ను పొడిగించేందుకు బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 35 మిలియన్ డాలర్లకు (రూ. 200 కోట్లకు) అగ్రిమెంట్ కుదిరింది. ఈ మీటింగ్లో స్టార్ మీడియా హక్కుల గురించి కూడా చర్చించనున్నారు. స్వదేశంలో భారత్ ఆడే అన్ని సిరీస్ల మీడియా హక్కులను స్టార్ మీడియా సొంతం చేసుకుంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నందున మీడియా రైట్స్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
భారత జట్టు జెర్సీ స్పాన్సర్గా బైజూస్ 2019లో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు చైనాకు చెందిన ఒప్పో కంపెనీ జెర్సీ స్పాన్సర్గా ఉంది. ఖతర్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది.