ముంబై: టీ20 వరల్డ్కప్లో పాల్గొన్న టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను ఇవాళ రిలీజ్ చేశారు. దుబాయ్లో జరగబోయే టీ20 వరల్డ్కప్లో కోహ్లీసేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనున్నది. బిలియన్ చీర్స్ జెర్సీ అన్న నినాదంతో కొత్త దుస్తుల్ని రిలీజ్ చేశారు. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణతో జెర్సీలను రూపొందించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. ఈ జెర్సీలు కావాలనుకున్నవారు ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. అక్టోబర్ 24వ తేదీ నుంచి టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్తో ఆ మ్యాచ్లో ఇండియా తలపడనున్నది.