ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి తన కొత్త రెవెన్యూ మోడల్ను ప్రకటించింది. ఆ విధానానం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీలో ఉన్న 600 మిలియన్ల డాలర్ల పూల్ నుంచి బీసీసీఐ(BCCI)కి 230 డాలర్లు కేటాయించారు. అంటే అది 38.5 శాతం అన్నమాట. అంత మొత్తాన్ని కేవలం బీసీసీఐకి ఎలా చెల్లిస్తారని పాక్ క్రికెట్ బోర్డు నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. 2024-27 సీజన్ కోసం ఈ ఆదాయ కేటాయింపులు జరిగాయి.
ఐసీసీ కొత్త రూల్ ప్రకారం .. పీసీబీకి 5.75 శాతం షేర్ దక్కింది. అంటే అది 34.51 మిలియన్ల డాలర్లు. నిజానికి గతంలో కంటే ఈసారి పాక్ క్రికెట్ బోర్డుకు రెండింతలు వాటా దక్కినా.. ఆ బోర్డు మాత్రం బీసీసీఐపై పెదవి విరిచింది. ఐసీసీ కొత్త అమలు చేస్తున్న రెవన్యూ షేరింగ్ విధానంగా సరిగా లేదని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
రెవన్యూ షేరింగ్ విధానాన్ని అమోదించేందుకు ఓటింగ్ ప్రక్రియ చేపట్టాలని పీసీబీ కోరింది. కానీ ఐసీసీ సభ్యులు మాత్రం పాక్ అభ్యర్థనను తోసిపుచ్చారు. త్వరలోనే ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్కు చెందిన షెడ్యూల్ను వెల్లడించనున్నట్లు పీసీబీ తెలిపింది.