న్యూఢిల్లీ: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన యువ భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేయగా.. యంగ్ఇండియాకు రూ. 5 కోట్లు అందించనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. ‘ఇది గర్వించదగ్గ తరుణం. దేశంలో మహిళల క్రికెట్కు ఇది మరింత తోడ్పాటునందిస్తుంది.
ఈ విజయంలో భాగస్వాములైన ప్లేయర్లు, సిబ్బందికి రూ. 5 కోట్లు ఇవ్వనున్నాం’ అని అందులో పేర్కొన్నాడు. వరల్డ్కప్ చేజిక్కించుకొని తిరిగి వస్తున్న షఫాలీ వర్మ బృందానికి వచ్చే నెల ఒకటిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఘనంగా సత్కరిస్తామని తెలిపాడు.