Team India : బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సిరీస్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో షమీ భుజానికి గాయం అయింది. దాంతో, అతని ప్లేస్లో యంగ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ను జట్టులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాతో డిసెంబర్ 14న మొదలుకానున్న టెస్ట్ సిరీస్ కూడా షమీ దూరమయ్యే అవకాశం ఉందని రిపోర్టులు చెప్తున్నాయి. ఆలోపు షమీ కోలుకోకుంటే అతని ప్లేస్లో మరో పేసర్ను తీసుకోవాల్సి వస్తుంది. ఆ రెండు టెస్ట్ మ్యాచుల్లో ఇండియా తప్పనిసరిగా విజయం సాధించాలి. లేదంటే వచ్చే ఏడాది టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే అవకాశం కోల్పోయే అవకాశం ఉంది.
బంగ్లాదేశతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్ టూర్కు విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్. రాహుల్ బంగ్లా సిరీస్ ఆడనున్నారు. దీపక్ చహర్, శార్థూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్ వంటి యువ ఆటగాళ్లతో భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
🚨 NEWS 🚨: Umran Malik to replace Mohd. Shami in India’s ODI squad for Bangladesh series. #TeamIndia | #BANvIND
Details 🔽https://t.co/PsDfHmkiJs
— BCCI (@BCCI) December 3, 2022