ముంబై: పన్నేండేండ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు స్టేడియంలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న బోర్డు..
ఈ నెల 25న గోవా వేదికగా వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎమ్) నిర్వహించనుంది. నిరుడు అక్టోబర్ తర్వాత బీసీసీఐ ఏజీఎమ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఇందులో అన్ని రాష్ర్టాలకు చెందిన బోర్డుల ఆఫీస్ బేరర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో 18 అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.