ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ క్రీడా విభాగంలో తమ కంపెనీ ఇచ్చే అవార్డు కోసం నామినీలను ప్రకటించింది. ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆప్ 2021’ పోటీలో ఐదుగురు నామినీలు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కూడా ఉంది. ఆమెతోపాటు రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన షట్లర్, హైదరాబాదీ పీవీ సింధు కూడా ఈ ఐదుగురు నామినీల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ అవార్డు కోసం నామినీల జాబితాను బీబీసీ సంస్థ మంగళవారం నాడు ప్రకటించింది. వీరిలో సింధు, మీరాబాయి చానుతోపాటు టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన గోల్ఫర్ అదితి అశోక్, పారాలింపిక్స్లో పలు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖరా, టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్ ఉన్నారు. ఈ ఐదుగురిలో మరి అవార్డు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
है शुभारंभ…
बीबीसी इंडियन स्पोर्ट्स वुमेन ऑफ द ईयर अवॉर्ड: ये 5 खिलाड़ी हैं इस बार की नॉमिनी.
अपनी पसंदीदा महिला खिलाड़ी को चुनिए- https://t.co/H82fHAGWg5
(वोट देने की आख़िरी तारीख़- 28 फरवरी 2022, 11.30 PM, शर्तें क्या हैं, देखें ऑनलाइन) pic.twitter.com/We8MZqssxI
— BBC News Hindi (@BBCHindi) February 8, 2022