బొడ్రాయిబజార్: సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సత్తా చాటింది. బాల, బాలికల విభాగాల్లో ఆ జిల్లా జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. మూడ్రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-16 బాస్కెట్బాల్ పోటీల్లో 31 జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొన్నా యి. శనివారం ఫైనల్ పోటీల్లో బాలికల విభాగంలో ములుగు జిల్లా జట్టుపై మేడ్చల్ మల్కాజిగిరి జట్టు గెలుపొందింది. బాలుర విభాగంలో వికారాబాద్ జిల్లా జట్టుపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జట్టు విజయం సాధించిం ది. బాలికల విభాగంలో ములుగు ద్వితీయ, వికారాబాద్ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేతలకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేశ్, డీవైఎస్వో వెంకట్రెడ్డి, పాల్గొన్నారు.