రాంచీ: ఇంగ్లండ్తో రాంచీలో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇండియాకు భారీ జలక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(Jaiswal) ఔటయ్యాడు. 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 73 రన్స్ స్కోర్ చేశాడతను. ఇంగ్లీష్ స్పిన్నర్ షోయెబ్ బాసిర్ బౌలింగ్లో అతను ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే బాషిర్ నాలుగు వికెట్లను తీసుకున్నాడు. సెటిల్ అయినట్లు కనిపించిన జైస్వాల్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్లో జైస్వాల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో అతను 600 రన్స్ స్కోర్ చేశాడు. ప్రస్తుతం ఇండియా 51 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. జురెల్ 6 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. సర్ఫరాజ్( 14 ) ఔటయ్యాడు.