IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు(Team India) ఒక్కసారిగా తడబడుతోంది. చూస్తుండగానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జో రూట్ బౌలింగ్లో యశస్వీ జైస్వాల్(37: 44 బంతుల్లో) ఔటైన కాసేపటికే రోహిత్ శర్మ(51 : 70 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) స్టంపౌట్ అయ్యాడు. హర్ట్లే బౌలింగ్లో హిట్మ్యాన్ ఫ్రంట్ఫుట్లో డిఫెన్స్ ఆడబోయాడు.
కానీ, బంతి అందుకున్న ఫోక్స్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(0) బషీర్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. లెగ్ సైడ్లో కాచుకొని ఉన్న ఓలీపోప్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పాటిదార్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్(15), రవీంద్ర జడేజా(2)లు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 78 పరుగులు కావాలి. అయితే.. ఇక్కడ సిరీస్ సమం చేసేందుకు ఇంగ్లండ్కు మరో 7 వికెట్లు అవసరం.
Game on! Bat-pad to leg slip and Bashir gets Patidar for a duck! #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024
ఓవర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్ తన తొలి ఓవర్లోనే యశస్వీని ఔట్ చేశాడు. జైస్వాల్ ఆఫ్ సైడ్లో ఆడిన బంతిని అండర్సన్ డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, 84 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే హిట్మ్యాన్ టామ్ హర్ట్లే బౌలింగ్లోరెండు పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో 17వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
1⃣7⃣th Test fifty for Rohit Sharma 👌 👌
Talk about captain leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/PymznAtOLZ
— BCCI (@BCCI) February 26, 2024
అశ్విన్, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో మూడో రోజు ఇంగ్లండ్ను 145 పరుగులకే కట్టడి చేసిన భారత్.. మ్యాచ్పై పట్టు బిగించింది. 192 పరుగుల ఛేదనలో ఓపెనర్లు యశస్వీ, రోహిత్ ధనాధన్ ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 40 రన్స్ కొట్టింది.