హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీలో బంగ్లాదేశ్ ప్లేయర్ జమాల్ హుస్సేన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షం కారణంగా శుక్రవారం జరుగాల్సిన పోటీలు రద్దు కావడంతో మూడు రౌండ్ల స్కోర్ల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసే సరికి 23-అండర్ 187(61-62-64) స్కోరుతో నాలుగు షాట్ల ఆధిక్యంలో ఉన్న జమాల్ను చాంపియన్గా ప్రకటించారు.
కెరీర్లో ఆరో టైటిల్ను ఖాతాలో వేసుకున్న జమాల్కు రూ.15 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ఈ విజయంతో పీజీటీఐ 2025 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 14 నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు. భారత్కు చెందిన అక్షయ్శర్మ, ఖలీన్ జోషి వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.