నేపియర్: సొంతగడ్డపై వన్డేల్లో న్యూజిలాండ్ వరుస విజ.యాల (17) జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ 31.4 ఓవర్లలో 98 పరుగులకు కుప్పకూలింది. బంగ్లాపై కివీస్కు ఇది అత్యల్ప స్కోరు కావడం విశేషం.
షోరిఫుల్ ఇస్లాం (3/22), తంజిమ్ హసన్ (3/14), సౌమ్య సర్కార్ (3/18) ధాటికి ఓపెనర్ విల్యంగ్ (26) మినహా అందరూ స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా.. 15.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ నజ్ముల్ (51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించాడు. తంజిమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, విల్ యంగ్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.