చటోగ్రామ్: పొట్టి ఫార్మాట్లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లా తొలిసారి టీ20 మ్యాచ్ గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన మొదటి టీ20లో బంగ్లా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (38) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. నజ్ముల్ హసన్ (51), కెప్టెన్ షకీబ్ (34 నాటౌట్) సత్తాచాటడంతో బంగ్లా సునాయాసంగా గెలుపొందింది.