ఢాకా : ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ పట్టు బిగిస్తున్నది. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఐర్లాండ్ ఇంకా 128 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసింది.
ముష్ఫికర్ రహీం 126, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 87, మెహిది హసన్ మిరాజ్ 55 పరుగులు చేశారు. ఆండీ మెక్బ్రైన్ 6 వికెట్లు, మార్క్ అడైర్, బెంజమిన్ వైట్ చెరి 2 వికెట్లు దక్కించుకున్నారు. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉన్నందున ఫలితం ఖాయం.