Bangladesh : పొట్టి ప్రంచకప్ విజేత అయిన ఇంగ్లండ్ (England) జట్టుకు బంగ్లాదేశ్ (Bangladesh) షాక్ ఇచ్చింది. ఆ జట్టుపై తొలిసారి అంతర్జాతీయ సిరీస్ గెలిచి నయా చరిత్ర సృష్టించింది. వన్డే సిరీస్లో ఆ టీమ్కు ఓటమి రుచి చూపిన బంగ్లా టీ20 సిరీస్లోనూ చెలరేగింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్పై ఆ జట్టు అంతర్జాతీయ సిరీస్ (International Series)గెలవడం ఇదే మొదటిసారి.
బంగ్లా ఏ షేర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 117 రన్స్కు ఆలౌట్ అయింది. మెహిదీ హసన్ మిరాజ్(Mehidy Hasan Miraz) 4 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా 18.5 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది.
మొదటి టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లా గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ తర్వాత నజ్మల్ హొస్సేన్ షంటో (Najmul Hossain Shanto) రాణించడంతో ఆ జట్టు అవలీలగా టార్గెట్ను చేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షంటో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. నామమాత్రమైన మూడో టీ20 మార్చి 14న జరగనుంది.