మీర్పూర్: బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో అఫ్గాన్ ముందు 662 పరుగుల లక్ష్యం నిలిచింది.
కొండంత టార్గెట్ చేజింగ్లో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న అఫ్గాన్ విజయానికి ఇంకా 617 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులు చేయగా.. అఫ్గాన్ 146 రన్స్కే ఆలౌటైంది.