హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగించింది. ఆదివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 52-49తో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బుల్స్ రెండో స్థానానికి చేరుకుంది. బెంగళూరు జట్టులో భరత్ 23 పాయింట్లతో జట్టును గెలిపించాడు. ఇతర ఆటగాళ్లలో వికాస్ 10, మహేందర్, అమన్ చెరో 4 పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టులో విజయ్ 14, నవీన్ 11, విశాల్, అశు మాలిక్ చెరో 5 పాయింట్లు సాధించారు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-39తో గుజరాత్పై విజయం సాధించింది.