భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో రికార్డు సృష్టించాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కాంస్య పోరులో 11-9 తేడాతో పోర్టోరికోకు చెందిన సెబాస్టియన్ సి రివేరాను ఓడించాడు. హోరాహోరిగా జరిగిన ఈ పోరులో బజరంగ్ పునియా.. తొలుత వెనుకబడ్డా తర్వాత పుంజుకుని కాంస్య పతకం సాధించాడు.
కాంస్య పతక పోరులో భాగంగా జరిగిన పురుషుల 65 కిలోల పోటీలో పునియా తొలుత వెనుకబడ్డాడు. సెబాస్టియన్ ఆదినుంచి పట్టు సడలకుండా ఆడాడు. ఆటలో తొలి సగం అతడే ఆధిపత్యం చెలాయించాడు. కానీ తర్వాత పునియా పుంజుకున్నాడు. ఇద్దరూ రింగ్లో కొదమసింహాల్లా పోరాడారు. మ్యాచ్ ఇంకా రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా పునియా రెండు కీలక పాయింట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో పునియా.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో నాలుగు పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్గా రికార్డులకెక్కాడు. పునియా గతంలో.. 2018 లో రజతం గెలవగా 2013, 2019, 2022లలో కాంస్యం నెగ్గాడు. ఇదిలాఉండగా.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. సుమారు 30 మంది రెజ్లర్లు పాల్గొన్నా వారిలో ఇద్దరు మాత్రమే పతకాలు సాధించారు. పునియా కంటే ముందు మహిళల 53 కిలోల విభాగంలో పోగట్.. కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే.
4️⃣th Worlds medal for @BajrangPunia 🤼♂️
Our Tokyo Olympics BRONZE medalist has bagged a BRONZE🥉 again. This time at the Wrestling World Championships (FS 65kg) in Belgrade🤩
His World Championships CV now:
SILVER – 2018
BRONZE – 2013, 2019, 2022#WrestleBelgrade pic.twitter.com/vF1kOEEflL— SAI Media (@Media_SAI) September 18, 2022