దుబాయ్: టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా పరుగుల వరద పారిస్తున్న ఆజమ్..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు.
బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో ఆజమ్ 818 పాయింట్లతో తన నంబర్వన్ ర్యాంక్ను మరింత పదిలం చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ టాప్ ర్యాంక్ రికార్డు(1,103రోజుల)ను బాబర్ అధిగమించాడు.