మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్లో కీలకమైన ఫైనల్కు ముందు కివీస్తో జరిగిన సెమీస్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మరో బ్యాటర్ రిజ్వాన్లు అద్భుతమైన ఫామ్లోకి వచ్చేశారు. పాక్ జట్టుకు గత కొన్నాళ్ల నుంచి ఈ ఇద్దరూ మేటి ఓపెనింగ్ జోడిగా రాణిస్తున్నారు. కివీస్తో మ్యాచ్లో బాబర్, రిజ్వాన్ తొలి వికెట్కు 105 రన్స్ జోడించారు. టీ20 వరల్డ్కప్లో ఆ జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది మూడవసారి. టీ20 టోర్నీ చరిత్రలో గతంలో ఏ ఓపెనింగ్ జోడి కూడా ఇలాంటి రికార్డును సృష్టించలేదు.
ఇక టీ20ల్లో ఆ జంట సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది తొమ్మిదో సారి. ఆ తర్వాత స్థానంలో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్లు ఉన్నారు. రాహుల్, రోహిత్ ఓపెనింగ్ జోడి తొలి వికెట్కు అయిదు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు.
టీ20 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా కూడా బాబర్, రిజ్వాన్ జంట నిలుస్తుంది. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో పాక్ జట్టు 2509 రన్స్ స్కోర్ చేసింది. ఈ ఇద్దరు ఓపెనర్ల యావరేజ్ ప్రస్తుతం 51.20గా ఉంది. ఇక ఫైనల్లో ఈ ఓపెనింగ్ జోడి మరేం రికార్డు సృష్టిస్తుందో చూడాల్సిందే.