హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై కేసులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టును ఆశ్రయించాడు. 2020-23 మధ్య కాలంలో కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేసినట్లు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ తేల్చింది. గత ఆగస్టులో హెచ్సీఏ నిధులపై కమిటీ ఆడిట్ నిర్వహించింది. దీనిపై ఉప్పల్లో అజర్పై నాలుగు కేసులు నమోదయ్యాయి.