హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ ఆటగాడు నోయల్ డేవిడ్కు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అండగా నిలిచాడు. అనారోగ్యంతో బాధపడుతున్న డేవిడ్ వైద్య ఖర్చులు హెచ్సీఏ భరిస్తుందని అజర్ ప్రకటించాడు. భారత్ తరఫున నాలుగు వన్డేలు ఆడిన ఆల్రౌండర్ డేవిడ్ (51) ఇటీవల కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో కోలుకుంటున్న డేవిడ్ను సోమవారం అజర్ పరామర్శించాడు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నాడు. కిడ్నీ మార్పిడి సర్జరీకి అయిన ఖర్చంతా హెచ్సీఏ భరిస్తుందని హెచ్సీఏ చీఫ్ భరోసానిచ్చాడు. 1997లో శ్రీలంకతో జరిగిన వన్డేలో చివరి సారి డేవిడ్ భారత్ తరఫున ఆడాడు.