హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెర్లిన్ వేదికగా జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్లో భారత స్విమ్మింగ్ జట్టుకు రాష్ట్రానికి చెందిన ఆయూశ్ యాదవ్ కోచ్గా నియమితుడయ్యాడు.
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 26 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. భారత్ నుంచి 198 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.