సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు భారత జట్టులో మార్పు చేశారు. పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్(Avesh Khan)ను తీసుకున్నారు. జనవరి 3వ తేదీ నుంచి కేప్టౌన్లో ఆ మ్యాచ్ జరగనున్నది. తొలి టెస్టులో ఇండియా దారుణంగా ఓడింది. ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో భారత్ పరాభవం చెందిన విషయం తెలిసిందే. వాస్తవానికి తొలి టెస్టులో షమీ ఆడలేదు. కానీ తొలుత రెండో టెస్టుకు అతన్ని ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల అతను ఇంకా జట్టుతో కలవలేదు. దీంతో షమీ స్థానంలో అవేశ్ ఖాన్కు చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండో టెస్టు కోసం బీసీసీఐ ప్రకటించిన భారత బృందం ఇదే : రోహిత్ శర్మ్(కెప్టెన్), శుభమన్ గిల్, జైస్వాల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్, సిరాజ్, ముకేశ్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, కేఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, అవేశ్ ఖాన్.
🚨 NEWS 🚨
Avesh Khan added to India’s squad for 2nd Test.
Details 🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/EsNGJAo8Vl
— BCCI (@BCCI) December 29, 2023