టోక్యో: పారాలింపిక్స్( Tokyo Paralympics )లో షూటర్ అవని లెఖారా( Avani Lekhara ) మరోసారి చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఒకే పారాలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్గా అవని నిలవడం విశేషం. దీంతో టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. శుక్రవారం ఉదయం హైజంపర్ ప్రవీణ్ సిల్వర్ గెలిచిన విషయం తెలిసిందే.