న్యూఢిల్లీ: రానున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మంచి ధర పలికే అవకాశముంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో ఆసీస్ ఆరోసారి టైటిల్ గెలువడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే వేలంలో ఈ ఆసీస్ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం వేలం కోసం మొత్తం 1166 మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. పది ఫ్రాంచైజీల్లో 77 ఖాళీలు ఉండగా, ఇందుకోసం 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మెగాటోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నాడు.