వింబుల్డన్లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ ఎబ్డెన్, మ్యాక్స్ పర్సెల్ జోడీ వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్లు అయిన క్రొయేషియా జోడీ మేట్ పావిక్, నికోలా మెక్టిక్పై వీళ్లిద్దరూ విజయం సాధించారు.
మొత్తం 4 గంటల 11 నిమిషాల పాటు పోరాడిన ఈ ఆస్ట్రేలియన్ జోడీ.. ఎట్టకేలకు తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ ముద్దాడింది. మాజీ ఛాంపియన్లపై 7-6 (7-5), 6-7 (3-7), 4-6, 6-4, 7-6 (10-2) పాయింట్లతో ఎబ్డెన్, పర్సెల్ విజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 8 మ్యాచ్ పాయింట్లు సాధించి, చివరకు టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.