WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ నాలుగో రోజు.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 270 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో, భారత్ ముందు 444 పరగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షమీ ఓవర్లో ప్యాట్ కమిన్స్(5)భారీ షాట్కు ప్రయత్నించి అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ 8వ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అలెక్స్ క్యారీ(66) నాటౌట్గా నిలిచాడు. మరికాసేపట్లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
కొత్త బంతి అందుకున్న షమీ అంతకుముందు ఓవర్లో మిచెల్ స్టార్క్(41)ను ఔట్ చేశాడు. ఏడో వికెట్ 93 పరుగులభాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత వచ్చిన కమిన్స్ ధాటిగా ఆడే క్రమంలో వికట్ పారేసుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు, షమీ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు.